యాడ్స్ లోను రీ ఎంట్రీ ఇవ్వ‌బోతున్న మెగాస్టార్.

మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబ‌ర్ 150 త‌ర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన విష‌యం తెలిసిందే. డైన‌మిక్ డైరెక్ట‌ర్ వినాయ‌క్ డైరెక్ష‌న్ లో న‌టించిన ఖైదీ నెంబ‌ర్ 150 సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించి సెన్సేష‌న్ క్రియేట్ చేశారు. ఆత‌ర్వాత స్టైలీష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి డైరెక్స‌న్ లో.. సైరా న‌ర‌సింహారెడ్డి అంటూ పాన్ ఇండియా మూవీ చేశారు. మ‌రో విజ‌యం సొంతం చేసుకున్నారు. ఇప్పుడు మెగాస్టార్ వ‌రుస‌గా సినిమాలు చేస్తూ.. యంగ్ హీరోల‌కు సైతం గ‌ట్టి పోటీ ఇస్తున్నారు. బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ డైరెక్ష‌న్ లో న‌టించిన ఆచార్య సినిమా ఏప్రిల్ 29న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అయ్యింది.

ఆత‌ర్వాత చిరంజీవి గాడ్ ఫాద‌ర్, భోళా శంక‌ర్, వాల్తేరు వీర‌య్య సినిమాలు చేస్తున్నారు. అలాగే ఛ‌లో, భీష్మ చిత్రాల‌తో స‌క్స‌స్ సాధించిన యంగ్ డైరెక్ట‌ర్ వెంకీ కుడుముల‌తో కూడా ఓ భారీ చిత్రం చేయ‌నున్న‌ట్టుగా ప్ర‌క‌టించారు. ఇలా… వ‌రుస‌గా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్న చిరంజీవి ఇప్పుడు యాడ్స్ లో కూడా రీ ఎంట్రీ ఇవ్వ‌నున్నార‌ని స‌మాచారం. గ‌తంలో థ‌మ్స్ అప్, న‌వ‌ర‌త్నా ఆయిల్ బ్రాండ్స్ ప్ర‌క‌ట‌న‌ల్లో క‌నిపించారు. మ‌ళ్లీ ఇప్పుడు 13 సంవ‌త్స‌రాల త‌ర్వాత ప్ర‌క‌ట‌న‌ల్లో చిరంజీవి న‌టించ‌బోతున్నార‌ని తెలిసింది.

ఓ ప్ర‌ముఖ రియ‌ల్ ఎస్టేట్ సంస్థ చిరంజీవిని బ్రాండ్ అంబాసిడ‌ర్ గా ఉండ‌మ‌ని కోరడంతో ఆయ‌న ఒప్పుకున్నార‌ట‌. ఇందు కోసం భారీ మొత్తంలో రెమ్యూన‌రేష‌న్ తీసుకుంటున్నార‌ని… ఈ మేర‌కు అగ్రిమెంట్స్ కూడా జ‌రిగాయ‌ని స‌మాచారం. ఈ రియ‌ల్ ఎస్టేట్ సంస్థ వ‌ర్కింగ్ స్టైల్ న‌చ్చ‌డంతోనే బ్రాండ్ అంబాసిడ‌ర్ గా ఉండేందుకు ఓకే చెప్పార‌ట‌. ఇప్ప‌టికే చిరు త‌న‌యుడు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఓ రియ‌ల్ ఎస్టేట్ సంస్థ‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్ గా ఉన్నారు. ఇలా.. తండ్రీకొడుకులిద్ద‌రూ ఓ వైపు సినిమాల్లోను మ‌రో వైపు యాడ్స్ లోను దూసుకెళుతుండ‌డం విశేషం.

Related Posts